Tuesday, 14 May 2024 03:19:12 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ప్రకృతి విపత్తు వల్ల దెబ్బతిన్న ప్రభావిత ప్రాంతాల్లో కూనంనేని విస్తృత పర్యటన

కరెంటు పునరుద్ధరణ పనులు సత్వరమే పూర్తి చేయాలి. ●విపత్తులో ఇండ్లు కోల్పోయిన పేదలకు పరిహారంతోపాటు పక్కా గృహాలు మంజూరు చేయాలి ● పంట నష్టంపై సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు* ● కూలి లైన్, గాజులరాజం బస్తి, హనుమాన్ బస్తి, బూడిదగడ్డ ఏరియాల్లో రెండో రోజు పర్యటించిన ఎమ్మెల్యే

Date : 23 April 2024 02:39 PM Views : 418

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.23/ అక్షరం న్యూస్ : కొత్తగూడెం పట్టణం పరిధిలోని వర్ష ప్రాభావిత ప్రాంతాల్లో స్థానిక శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు రెండో రోజైన మంగళవారం విస్తృతంగా పర్యటించారు. గాజులరాజం బస్తి, బూడిదగడ్డ, కూలీలైన్, హానుమాన్ బస్తిల్లో ఈదురుగాలలు, వడగండ్ల వానతో దెబ్బ తిన్న ఇండ్లను పరిశీలించి జరిగిన నష్టాన్ని బాదితులను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ చేపట్టిన విద్యుత్ స్తంబాలు, విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. నిర్విరామంగా పనులు కొనసాగించి విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్దరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలులతో తీవ్ర నష్టం వాటిల్లిందని, పేదల ఇండ్లు, గుడిసెలు నెలమట్టమై నిరాశ్రయులుగా మారారని, వీరికి పునరావాసం కల్పించడంతోపాటు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండ్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల మంజూరులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గాజులరాజం బస్తిలో ఇంటి రేకు మీదపడి గాయాలపాలైన దేవమ్మను పరామర్శించారు. జిల్లా వ్యాప్తంగా 278 విద్యుత్ స్తంబాలు కూలిపోయాయని, 48 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతున్నాయని అధికారులు ప్రకటించారని, వీటి పునరుద్ధరణ దాదాపుగా పూర్తికావచ్చిందని తెలిపారు. మంగళవారం సాయంత్రంలోపు సాధారణ పరిస్థితులకు తీసుకొచ్చే విధంగా విద్యత్ శాఖ శ్రమించాలని కోరారు. ఈదురుగాలులతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అదేవిదంగా దాల్వ వరి సాగుచేసిన రైతులకు నష్టంవాటిల్లిందని, ఈ నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేపట్టి జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించడం ద్వారా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విధంగా కృషి చేయాలన్నారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా ఉన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :