అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : . గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 30/అక్షరం న్యూస్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పుట్టుకొచ్చిన కరోనా సమయంలో సేవలందించి డబ్బే ప్రధానంగా పనిచేసిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు కనుమరుగైపోయాయి. మండుటెండల తో జనాలు బెంబేలెత్తుతుంటే కూలీలు సంఘటిత అసంఘటిత కార్మికులు వలస కూలీలు పనులు చేస్తూ ఎండ తీవ్రత కు దాహార్తిని తీర్చే చలివేంద్రం లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కేవలం తాము చేసిన సేవలను జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ వద్ద స్థలాల కోసం వినతి పత్రం పెట్టడమే తప్ప స్వచ్ఛందంగా సేవ చేద్దామని ఆలోచన లేకపోవడం గమనార్ధం. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి కార్మికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వెలబడుతుంది.లక్ష్మీ నగర్ లో వ్యాపార కేంద్రాల్లో హాస్పిటల్స్ కు వచ్చే పేషెంట్లకు మహిళలకు కూలీలకు ఎంతో ఉపయోగపడే విధంగా మజ్జిగ కేంద్రాలు చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు కూడా దృష్టి సారించకపోవడం శోచనీయం. గతంలో కొన్ని వ్యాపార సంస్థలు చలివేంద్రాలు నిర్వహించిన వ్యాపారమే ప్రధానంగా వేసవి దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ................ లలిత శ్రీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సేవలు.. గత 11 సంవత్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేదలను కొడుకులను ఇంటి యజమానులను కోల్పోయిన కొంతమంది భాగ్యల పాలిట ఆపన్న హస్తము అందిస్తూ నేనున్నానంటూ కరోనా సమయంలో నిత్యవసర వస్తువులు బియ్యం పంపిణీ చేస్తూ అన్నదానాలు చేస్తూ ఇప్పటికి సేవలందిస్తున్న లలిత శ్రీ ఫౌండేషన్ వేసవి కాలం దృష్ట్యా మండుటెండలకు దాహార్తికి గొంతెందుతూ తపించిపోయే పేద ప్రజల కోసం మహిళల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తాను త్వరలోనే మజ్జిగ కేంద్రం మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.మండుటెండల్లో పేదల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛందంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె కోరారు.
.
Aksharam Telugu Daily