అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ కొత్తగూడెం ముస్లిం సోదర సోదరీమణులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులు ఈ పవిత్ర పండుగను కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో ముస్లీం సోదరులు చేసిన కఠిన ఉపవాస దీక్షలను ఈద్-ఉల్-ఫితర్ పండుగతో ముగిస్తారని అన్నారు.ఈ రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలందరూ సోదర భావాన్ని కలిగియుండి సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని కోరారు.
-
Aksharam Telugu Daily