అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి28(అక్షరం న్యూస్ ) హుస్నాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు భాగ్యరెడ్డి, రత్నమాల హాజరయ్యారు. అనంతరం అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల స్థాయి అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైనదని, క్రమశిక్షణతో శ్రద్ధతో చదువు పై ఆసక్తిని కనపరిస్తే విద్యార్థులు అద్భుత ఫలితాలు పొందగలుగుతారని తద్వారా తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారని అన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థలు విజయాలకు ప్రతీకలని, విద్య ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై బాటలు వేస్తున్న అల్ఫోర్స్ తెలంగాణ రాష్ట్రానికి తలమాచికమని కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యఅతిధులు ప్రసంగించారు. ఇట్టి వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily