అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఎప్రిల్.02/ అక్షరం న్యూస్; ఎండల తీవ్రత దృశ్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్ శిరీష సూచించారు. వడ దెబ్బ నివారణ ప్రతిఒక్కరు వైద్య ఆరోగ్య శాఖ సూచనలను పాటించాలని కోరారు. ఈసందర్భంగా డిఎం.హెచ్.ఓ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఎండాకాలంలో సరిపడా ద్రవాలు తీసుకోవడం మంచిదని దాహం వేయకపోయినా, వీలైనప్పుడల్లా తగినంత నీరు త్రాగాలని, దాహం డీహైడ్రేషన్ కి మంచి సూచిక కాదని పేర్కొన్నారు. ప్రయాణించేటప్పుడు తాగునీరు వెంట తీసుకెళ్లాలని , ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓ.ఆర్.ఎస్) ఉపయోగించాలని, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలను కొద్దిగా ఉప్పు కలిపి త్రాగాలని అన్నారు. సన్నని వదులుగా, లేత రంగులో ఉండే కాటన్ దుస్తులను ధరించాలని, సూర్యరశ్మి నేరుగా బహిర్గతమయ్యే సమయంలో గొడుగు, తలకు టోపీ, టవల్ మరియు ఇతర సాంప్రదాయ తలపాగాను ఉపయోగించాలని సూచించారు . వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, శిశువులు మరియు చిన్న పిల్లలు , గర్భిణీ స్త్రీలు , ఆరుబయట పనిచేసే వ్యక్తులు, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు చల్లటి వాతావరణం నుండి వేడి వాతావరణానికి వచ్చే వ్యక్తులు వడగాలుల సమయంలో బయట వారి శరీరాలు వేడికి అలవాటు పడటానికి ఒక వారం సమయం పడుతుందని, దీనికోసం పుష్కలంగా నీరు త్రాగాలని ,వీలైనంత వరకు చల్లటి ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 1 2:00 నుండి 03:00 గంటల మధ్య ఎండలో బయటకు రాకుండా ఉండాలని, మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శారీరక కష్టంతో కూడిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అధిక శరీర ఉష్ణోగ్రత మరియు ఏదైనా అపస్మారక, గందరగోళం, లేదా చెమటలు పట్టకపోవడం ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే 108 కి ఫోన్ చేసి సరైన సమయంలో వైద్య సహాయం అందించాలని కోరారు.
.
Aksharam Telugu Daily