అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పొట్టి శ్రీరాములు /నెల్లూరు : ఇటీవల ఎన్ టి ఏ విడుదల చేసిన జేఈ ఈ మెయిన్స్ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులతో నెల్లూరు ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ డంక మోగించారు. ఈ సందర్భంగా జోనల్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, అకాడమిక్ డీన్ రాంబాబు లు విద్యార్థులను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జోనల్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, అకాడమిక్ డీన్ రాంబాబు లు మాట్లాడుతూ విద్యార్థులకు ర్యాంకులు రావడం ఆనందంగా ఉందన్నారు. ఓబిసి విభాగంలో శరత్ తేజ 99.42 పర్సంటేలతో ఆల్ ఇండియా 2,072 ర్యాంక్ ని కైవసం చేసుకున్నారు. అలాగే పిన్నమ్మ రెడ్డి, శివ సాత్విక్ ఆల్ ఇండియా 4,708, సనత్ బాబు ఆల్ ఇండియా 5,295, దివ్య కొత్త ఆల్ ఇండియా 7,447, నీరజ్ కుమార్ ఆల్ ఇండియా 9,607, అభిరాం రెడ్డి ఆల్ ఇండియా 10,281, లక్ష్మీ యశ్వంత్ ఆల్ ఇండియా 10,887, 20 వేల లోపు ఆల్ ఇండియా ర్యాంకులను 10 మంది సాధించారు. ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన వారిని ఎస్సార్ ఎడ్యుకేషనల్ అకాడమీ వ్యవస్థాపకులు వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, డీజిఎం గోవర్ధన్ రెడ్డి అభినందించారు. అలాగే బోధన సిబ్బందిని బోధినేతర సిబ్బందిని అభినందించారు. రానున్న రోజుల్లో ఇంకా మంచి ర్యాంకుల కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ జిఎం రాజేంద్రప్రసాద్, జోనల్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, అకాడమిక్ డీన్ రాంబాబు, కృష్ణారెడ్డి, ఏజీఎం వివి నాయుడు, ప్రిన్సిపల్ అమరేందర్ రెడ్డి, సుబ్బారెడ్డి, నరసింహారావు, జయప్రకాష్, కిరణ్, శైలేష్, ఏవో కోదండరాం, రమేష్, నాగిరెడ్డి, ఫియాజ్, పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily