అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట్/నేరేడుచర్ల : * సూర్యాపేట/నేరేడుచర్ల/ఏప్రిల్27(అక్షరంన్యూస్):- ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ ఆదేశాల మేరకు నేరేడుచర్ల యస్ఐ రవీందర్ నాయక్ దర్శించర్ల గ్రామం లో పోలీసు కళాభృందం అధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మహిళల, విద్యార్థుల రక్షణ, చట్టాలు, విద్యా విధానాలు, సమస్యలను అధిగమించడం, సోషల్ మీడియా, ఇంటర్నెట్ సద్వినియోగం లాంటి అంశాలపై మరియు విద్యార్థులు ఒత్తిడి అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలి, లక్ష్యం కోసం కృషి చేయాలని పోలీస్ కళాబృందం సభ్యులు పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.నేరేడుచర్ల యస్ ఐ రవీందర్ నాయక్ మాట్లాడుతూ జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ అధ్వర్యంలో మహిళల రక్షణపై పటిష్టంగా పని చేస్తున్నామని,గ్రామాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా శాంతి భద్రతలకు ఆటంకం కలిగించకుండా పరిష్కారం చేసుకోవాలి చట్టాలను చేతుల్లోకి తీసుకోకుండా వాటిని గౌరవించి పోలీస్ వారికి తెలియపరచాలి. ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సోషల్ మీడియాలో ఎవరినైనా ఉద్దేశించి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టరాదు.సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా, ఎటిఎం కార్డ్ వివరాలు, ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు, యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అని తెలిపినారు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. పోలీసు కళబృందం వారు సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో సామాజిక అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం నందు పోలీస్ సిబ్బంది హోంగార్డ్ వెంకన్న, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపి, క్రిష్ణ,చారి, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily