Tuesday, 14 May 2024 03:25:06 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

మీ తో నడుస్తా.. అందరికీ అండగా నిలుస్తా....

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి తెల్లవారుజామునుంచే పటేల్ స్టేడియం లో వాకర్లతో కలిసి ప్రచారం షురూ..

Date : 27 April 2024 10:41 AM Views : 758

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ ఏప్రిల్ 27 (అక్షరంన్యూస్) ఖమ్మం: అపుడే తెలతెలవారుతుండగా..మెడలో కాంగ్రెస్ కండువా వేసుకుని..అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. వాకర్లతో అడుగులేస్తూ..క్రికెట్ క్రీడాకారులతో కలిసి కాసేపు బ్యాటింగ్ చేసి..ఉత్సాహం నింపారు. ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు రఘు రాం రెడ్డి. సీపీఐ, సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి శనివారం ఉదయం 6 గంటల నుంచే ప్రచార పర్వం మొదలెట్టారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, మువ్వా విజయ బాబు, నిరంజన్ రెడ్డి లతో కలిసి నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ వాకింగ్ చేస్తున్న వారితో కలిసి ..ముందుకు నడుస్తూ.. అక్కా, అన్నా అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. హస్తం గుర్తుపై ఓటేసి.. తనను భారీ మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు. మైదానంలో క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడి, ఇండోర్ షటిల్ కోర్టులో గేమ్ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. మైదానం లో సీపీఎం సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, సుబ్బారావు తదితరులు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రఘురాం రెడ్డి వాకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాసేవకే పోటీ చేస్తున్నానని, అందరికీ అండగా ఉండాలని అభయమిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నగర అధ్యక్షులు మొహమ్మద్ జావిద్, కార్పొరేటర్లు చావా నారాయణ, మిక్కిలినేని మంజుల నరేందర్, నాయకులు కొత్త సీతారాములు, కొప్పుల చంద్రశేఖర రావు, మద్ది కిషోర్ రెడ్డి, హుస్సేన్, వడ్డెబోయిన శ్రీనివాస్, నెల్లూరు చంద్రయ్య, వాకర్స్ క్లబ్ బాధ్యులు మలీదు నాగేశ్వరరావు, కేతినేని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :