Tuesday, 14 May 2024 03:57:44 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు

రాజ్యాంగ స్ఫూర్తితో,అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని -రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

Date : 15 April 2024 09:28 AM Views : 163

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : - రామగిరి (పెద్దపెల్లి జిల్లా) ఏప్రిల్ 14 అక్షరం న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలో అంబేద్కర్ (133) జయంతి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మంథని చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో వారి ప్రావిణ్యతను పెంచడం కోసం ప్రత్యేకంగా నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళి అనుసరించి ఆలస్యం జరుగుతున్నదని అన్నారు. హైదరాబాద్ నుండి ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లకు వీడియోలు, ఆడియోల ద్వారా కోచింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరున విద్యను అందించాలనే ఆలోచన మేరకు ఈ నాలెడ్జ్ సెంటర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు.కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని వారికి అనుగుణంగా మార్చాలనే ఆలోచన చేస్తున్నాయన్నారు.గత పది సంవత్సరాలపాటు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.రాజ్యాంగ స్ఫూర్తితో,అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని పేర్కోన్నారు.రాహుల్ గాంధీ పిలుపుమేరకు ఈ రాష్ట్రంలో నవసమాజం, సమానత్వంతో పరిపాలనలో పూర్తిస్థాయిలో ముందుకు వెళ్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మండల నాయకులు, అని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :