అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/ఏప్రిల్ 2/అక్షరం న్యూస్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 2024 సంవత్సరంకుగాను ఉత్తమ గాయకునిగా ఉగాది పురస్కార్ అవార్డు కు గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన గద్దల శశిభూషణ్ ఎంపికయ్యారు. బిట్ బిట్ డాన్స్ అకాడమీ దేవా కళ బృందం వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారాలు 2024 ఉత్తమ గాయకుడిగా అవార్డుకు గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన గద్దల శశిభూషణ్ ఎంపికయ్యారు. నవరస గాయకులుగా పాటకు ప్రాణం పోస్తూ కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని కళా రంగంలో మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని బిట్ బిట్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు తుమ్మల విజయ్, గ్రాండ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ పులిపాక దేవేందర్, డాన్స్ మాస్టర్ వీర్ల ప్రశాంత్,మాస వికాస వేదిక కళామండలి రాష్ట్ర అధ్యక్షులు దాసరి రామస్వామిలు తెలిపారు.గద్దెల శశి భూషణ్ చేస్తున్న సేవలను అభినందిస్తూ 2024 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బిట్ బిట్ డాన్స్ అకాడమి తరఫున ఈనెల 5న పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఉత్తమ గాయకుడిగా ఉగాది పురస్కార్ అవార్డును అందజేయన్నట్లు వారు పేర్కొన్నారు.ఉత్తమ గాయకుడిగా ఉగాది పురస్కార అవార్డుకి ఎంపికైన గద్దల శశిభూషణ్ ను సీనియర్ పాత్రికేయులు అక్షరం ప్రతినిధి సిరిమల్లె మధు,సీనియర్ జర్నలిస్ట్ బండ రాము గౌడ్,సీనియర్ బి.ఆర్.ఎస్ నాయకులు పద్మశాలి సేవా సంఘం రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు చిప్ప రాజేశం,నాగరాజు తదితరులు అభినందనలు తెలిపారు.
.
Aksharam Telugu Daily