అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : . సుల్తానాబాద్,(పెద్దపల్లి జిల్లా), ఎప్రిల్ 24, అక్షరం న్యూస్. సుల్తానాబాద్ పట్టణం లోని శ్రీవాణి జూనియర్ కళాశాల విద్యార్థినీ, విద్యార్ధులు ఇంటర్ ఫలితాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో శ్రీవాణి కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి తో పాటూ జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక ఒక ప్రకటన లో తెలిపారు. ఇంటర్ ఎం.పి.సి.మొదటి సంవత్సరం ఫలితాల్లో రేగడి మద్ధికుంట కు చెందిన సి. హెచ్. శివకుమార్. రాముని పల్లి కు చెందిన విద్యార్థినీ నేహా వర్మ, రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించారు.అలాగే బి. పి.సి.లో నాజ్నీన్, నిడా ఖానం. అత్యుత్తమ ర్యాంకు సాధించారు.సి.ఈ.సి. విభాగం నుంచి సమరీన్, వర్ల లక్ష్మీ ప్రసన్న, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. వీరితో పి అవినాష్, సబిహా, ఖిజర్, తదితర విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించారు.అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్దులకు కళాశాల చైర్మన్ డాక్టర్ రేకులపల్లి విజయ, సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక, డైరెక్టర్ రేకులపల్లి సుష్మ , ప్రిన్సిపల్స్ , అధ్యాపక బృందం సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు
.
Aksharam Telugu Daily