అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/కరీంనగర్/ ఏప్రిల్ 20(అక్షరం న్యూస్) శంకరపట్నం మండలం కన్నాపూర్ అంగన్వాడి కేంద్రంలో ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఆక్టివిటీ ప్రదర్శన శుక్రవారం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏసీడీపీఓ అరవింద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..అంగన్వాడీ కేంద్రాల కు వచ్చే చిన్నారులు ఆడుతూపాడుతూ,నీతి కథలు వింటూ పాఠాలను నేర్చుకుంటారు.మూస విధానంతో కొనసాగే బోధనకు స్వస్తి పలుకుతూ చిన్నారుల్లో ఆలోచనలు రేకిత్తిస్తూ మేథోశక్తిని పెంచేందుకుగానూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు. చిన్నతనంలోనే భవిష్యత్కు అవసరమైన కార్యక్రమాలపై దృష్టి మళ్లిస్తే,చిన్నారులు ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ విద్యను అందిస్తున్నది.అంగన్వాడీ కేంద్రాల్లో మూడు నుండి నాలుగేండ్లలోపు చిన్నారులు జాయిన్ అవుతారు.వారికి మెదడు ఎదుగుదల 80 శాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఈ సమయంలో ఆటలు,పాటల రూపంలో అక్షరాలను గుర్తించడం వంటివి చేయిస్తే మెదడు చురుకుగా పని చేయడంతోపాటు,జ్ఞాపకశక్తి పెరుగుతుంది.ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా బోధించడం వల్ల వారికి అర్థం అవుతుంది.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్వేత, సూపర్వైజర్ స్రవంతి,ఏడబ్ల్యుటి లు రాజమణి,కాంత,ఏఎన్ఎంలు, ఆశలు,గ్రామ మహిళలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily