అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.02 / న్యూస్; అల్లాహ్ నీటిని జీవానికి ఆధారం మరియు మూలంగా ప్రకటించాడని ఖిద్మతే ఇన్సానియత్ వెల్ఫైర్ సొసైటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇబ్రహీం మరియు వైస్ ప్రెసిడెంట్ హఫీజ్ జలీల్ అన్నారు. ఎండల వల్ల ఆసుపత్రికి వచ్చే ప్రజలు మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవద్దనే ఉద్దేశ్యంతో ఖిద్మతే ఇన్సానియత్ వెల్ఫైర్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం మాత శిశు ఆరోగ్య కేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ చలి వేంద్రాన్ని ఆర్.ఎం.ఓ వీరబాబు చేతుల మీద ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఖిద్మతే ఇన్సానియత్ ఆధ్వర్యంలో కొత్తగూడెం లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని , ఖిద్మతే ఇన్సానియత్ వెల్ఫైర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమం మోడ్రన్ ఇక్ర స్కూల్ ప్రిన్సిపల్ షేక్. బాసిత్ సొసైటి సభ్యుల అజీజ్, గౌస్, ఇర్ఫాన్, ఖదీర్, సలీం, మోయిన్, సాదిక్, తౌసిఫ్, షఫీ ,అక్బర్ మరియూ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily