Tuesday, 14 May 2024 05:03:06 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ప్రారంభానికి ముందే కాలి బూడిదైన తల్లాడ పల్లె ప్రకృతి వనం..

ప్రభుత్వ లక్షలాది సొమ్ము దుర్వినియోగం.. మొదట్నుంచి పల్లెప్రకృతి వనంపై దృష్టి సారించని పాలకవర్గం.. అధికారులు..

Date : 13 April 2024 08:48 PM Views : 755

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ ఏప్రిల్ 13 (అక్షరంన్యూస్) ప్రారంభానికి ముందే తల్లాడ పల్లె ప్రకృతి వనం ఖాళీ బూడిదైంది. శనివారం రాత్రి ప్రమాదవశాత్తు వనంలో గడ్డికి నిప్పు అంటుకొని ఆహుతి అయింది. గత పాలకవర్గం పట్టించుకోకపోవడం, అధికారులు కూడా చూసి చూడనట్లుగా వదిలేయటంతో లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్ము బూడిద పాలు అయింది. గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రకృతి వనంకు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారు. తల్లాడ మేజర్ పంచాయతీతో పాటు మంగాపురం, గాంధీనగర్ తండాల కలిపి ఈ పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. కానీ తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టించుకోకుండా వనంలో సౌకర్యాలు ఏర్పాట్లు నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఈ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి త్వరతగతిన పూర్తి చేయాలని, ప్రజలకు అందుబాటులోకి తేవాలని పాలకవర్గాన్ని, అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ వారు పట్టించుకోకుండా నిరుపయోగంగా ఉంచటంతో గడ్డిపెరిగి అగ్నికి ఆహుతి అయింది. బూడిద అదేవిధంగా వనంలో చేసిన మొక్కలు పెరిగినప్పటికీ మంటలు ఎక్కువగా రావడంతో చెట్లన్నీ కాలిపోయాయి. దీంతో ప్రభుత్వ సొమ్ము బూడిద పాలు కావడంతో పాలకవర్గం, అధికారుల తీరుపై ఈ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంటలను ఆర్పేసిన పైరింజన్ సిబ్బంది.. పల్లె ప్రకృతి వనం కాలిపోతుందన్న విషయం తెలుసుకున్న ఫైర్ ఇంజన్ అధికారులు హుటా హుటీన చేరుకొని మంటలను ఆర్పేశారు. ఫైర్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాగులు మీరా, రవితోపాటు సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేశారు. వారితో పాటు స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది, మంటలను ఆర్పటంలో సహాయం అందించారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :