అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : . శంకరపట్నం/కరీంనగర్/ ఏప్రిల్ 16( అక్షరం న్యూస్) మండలంలోని లింగాపూర్ గ్రామంలో సోమవారం సాయుధ బలగాలతో పోలీసులకు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్ సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కేసు నమోదు చేస్తామన్నారు. అభ్యర్థులను స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనివ్వాలని అడ్డుకుంటే ఉపేక్షించమన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily