Tuesday, 14 May 2024 06:08:54 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

గడ్డం వంశీకృష్ణకు ప్రజలు ఆదరణ సూచి ప్రత్యార్థుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి

గడ్డం వంశీ భారీ మెజార్టీతో గెలవడం తథ్యం చింతకుంట విజయ రమణారావు

Date : 22 April 2024 08:08 PM Views : 249

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి అక్షరం న్యూస్ ఏప్రిల్ 22 సోమవారం ఎలిగేడు మరియు జూలపల్లి మండలాలల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దపల్లి పార్లమెంట్ ప్రచార సభలు కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం అందరూ కలిసి కట్టుగా అహర్నిశలు పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసిన శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు . అనంతరం అభ్యర్థి వంశీ ని ఎలిగేడు, జూలపల్లి మండలలా నాయకులకు, కార్యకర్తలకు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరిచయం చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వంశీకృష్ణ ని భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. ఆనాడు నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పల్లె పల్లెకు విజ్జన్న అనే నినాదంతో ప్రతి గ్రామానికి ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ప్రజల కష్టాలు చుసిన వాన్ని అని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తాం అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల కష్టంతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అలాగే నా జీవితం ఉన్నదే ప్రజలకు సేవా చేయడానికి మాత్రమే ఎల్లప్పుడూ ప్రజల కోసమే ఉంటానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 5 న్యాయ గ్యారంటీలను ప్రజలకు వివరించడం జరిగింది అని తెలుపుతూ ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన పంటకు అధిక మొత్తంలో తలు తరుగు పేరుతో వడ్లు కటింగ్ చేసి రైతులను మోసం చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వనిది అని అన్నారు... ఈ టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి అయిన కొప్పుల ఈశ్వర్ ఆనాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు వడ్లు కటింగ్ అయినప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలని అన్నారు.. ప్రజల కష్టాలు పట్టించుకోని కొప్పుల ఈశ్వర్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నావు అలాగే దొంగ దీక్షలు చేస్తూ ప్రజలను మోసం ఇంకా ఎన్ని రోజులు చేస్తారని ఎద్దేవా చేసారు.. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు వడ్ల కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు వడ్ల కటింగ్ లేకుండా చేయడం జరిగింది అని అంటూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం... పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయం అయింది అని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి చేసుకుందాం అని కోరడం జరిగింది.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు గారి ఆధ్వర్యంలో పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జూలపల్లి మండలానికి చెందిన వివిధ గ్రామాల నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ఎలిగేడు, జూలపల్లి మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :