అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.06/ అక్షరం న్యూస్ : కొత్తగూడెం ఈద్గా మరియు ఖబ్రిస్థాన్ కు హడహక్ కమిటీ ని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అడక్ కమిటి అధ్యక్షుడిగా మహ్మద్ గౌస్ మోహినుద్దీన్ , ఊపాఅధ్యక్షుడిగా ఉమర్ ఫారూఖ్ మరియు ఇరవై ఆరు మంది సభ్యులను నియమిస్తూ వక్ఫ్ బోర్డు సిఇఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అడహాక్ కమిటి అధ్యక్షులు మహ్మద్ గౌస్ మోహినుద్దీన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగ ఈ సంవత్సరం కూడా ఈద్గా లో నమాజ్ నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని, ఈద్గా లో నమాజ్ కువచ్చే ముసల్లిలకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చెస్తున్నామని తెలిపారు. కొత్తగూడెం ఈద్గా లో రంజన్ పండుగ నమాజ్ ఉదయం 9:00 గంటలకు ప్రారంభం అవుతుందని ,పండుగ నమాజ్ ఆచరించేందుకు వచ్చే ముసల్లిలు తమవెంట జానీమాజ్లు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యంఏ. రజాక్, అన్వర్ పాషా, ఖమర్, యఖుబ్ ఖాద్రీ, మహబూబ్ ఖాద్రీ, సయ్యద్ యఖుబ్ ఉద్దీన్, మహ్మద్ హుస్సేన్ ఖాన్, మహ్మద్ అక్తర్ పాషా, అమీర్ ఖాద్రీ, బషీర్, హైమద్, తదితరులు పాల్గొన్నారు. ● కొత్తగూడెం ఈద్గా మరియు ఖబ్రస్థాన్ స్మశాన వాటిక కమిటీల నియామకంలో మితిమీరిన రాజకీయ పార్టీల జోక్యం ● రాజకీయ పార్టీల జోక్యం పై అసహనం వ్యక్తం చేస్తున్న ముస్లిం మత పెద్దలు ,రాజకీయ విశ్లేషకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ని కొత్తగూడెం పట్టణ ఈద్గా మరియు ఖబ్రస్థాన్ తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉండడంతో ఇక్కడ కమిటీలు వేయడం ఎప్పుడు తలనొప్పిగానే మారింది. ఇక్కడ కమిటీ ల విషయంలో రాజకీయ పార్టీల జోక్యం మితిమీరి పోతోందని ముస్లిం సంఘాలు ,మత పెద్దలు ,రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉన్న స్థలాలకు అన్ని జమాత్ ల మత పెద్దలను కలిపి ఒక కమిటిగా వేయాల్సి ఉండగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనం కోసం తమ పార్టీ నాయకులను కమిటీ బాద్యులను చేసి కమిటీలు వేస్తున్నారని మొదటి నుంచి ముస్లిం లలో రాజకీయ పార్టీల పట్ల అసహనం నెలకొని ఉంది ... కాగా ఈసారి వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉన్న ఆధ్యాత్మిక స్థలాలకు కమిటీలు వేసే క్రమంలో నియోజకవర్గానికి చెందిన సీపీఐ పార్టీ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు మరియు కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పొందేం వీరయ్య ల లెటర్ హెడ్ ల మీద తమ అభ్యర్థులకు కమిటీ ఇవ్వాలని పోటా పోటీగా వక్ఫ్ బోర్డుకు పైరవీలు చేయడం కొత్తగూడెం నియోజకవర్గ ముస్లిం సంఘాలలో చర్చనీయాంశంగా మారింది. ఇలా ఆధ్యాత్మిక ప్రదేశాలలో స్థానికులు ,స్థానికేతరులు ఎవరో తెలుసుకోకుండా రాజకీయ పార్టీల నాయకులు తమ రాజకీయ స్వలాభం కోసం తమ పార్టీ అనుకూల వ్యక్తులకు కమిటీలు ఇప్పించడం పై ప్రజల్లో అసహనం, వ్యతిరేకత నెలకొంటుందని రాజకీయ పార్టీల నాయకులు గుర్తించక పోవడం శోచనీయమని పలువురు మత పెద్దలు భావిస్తున్నారు. ఇక ఈద్గా వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉండడంతో ఇక్కడ నమాజ్ చదివించే ఇమామ్ లేదా స్థానిక ప్రభుత్వ ఖాజీ వక్ఫ్ బోర్డ్ నుంచి నియమితులైన వారవడం వల్ల నమాజ్ చదివించే ఆనవాయితీ ఉంది .ఈ సారి ఇలా జరుగుతుందా లేదా అనేది చూడాలని ముస్లిం మతపెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily