అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : చొప్పదండి /కరీంనగర్, ఏప్రిల్ 03 (అక్షరం న్యూస్ ) విప్లవ వీరుడు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దోడ్డి కొమరయ్య 97 జయంతి వేడుకలు చొప్పదండి పట్టణంలోని కురుమ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగాయి. కురుమ యువజన సంఘం అధ్యక్షులు జిట్ట కుమార్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత దొడ్డి కొమురయ్య అడుగుజాడల్లో, వారి ఆశయాలు నెరవేర్చాలని కోరినారు.అలాగే ఈ వేదిక ద్వారా హైదరాబాదులోని ట్యాంక్ బాండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ నిట్టు మునేష్ ,గుంటి స్వరూప, రాజన్నల తిరుపతి, నీట్టు శ్రీనివాస్, పెద్ది సంపత్, అనిల్, శ్రీనివాస్, వంశీ, రాకేష్, బీరయ్య, వంశీ, కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది
.
Aksharam Telugu Daily