అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : - చొప్పదండి/ కరీంనగర్, మార్చి 27 (అక్షరం న్యూస్ ) కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ పరిధిలోని సీఎస్ఐI చర్చి దగ్గర కొత్తూరి హనుమమ్మ గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రోజు ఉదయం మరణించారు.వారి ఆర్థిక పరిస్థితి బాగులేదని తెలుసుకున్న చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చేయూత వెల్ఫేర్ తరపున వహనుమమ్మ దహన సంస్కారాల నిమిత్తం మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినారు. ఈ కార్యక్రమంలో చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జిట్ట కుమార్, మహమ్మద్ చాంద్ పాషా, దుడం ఈశ్వర్, గంగు రాజు, సభ్యులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily