అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/ కరీంనగర్/ ఏప్రిల్ 22 ( అక్షరం న్యూస్) శంకరపట్నం మండలంలోని మక్త గ్రామంలోని గంగా,కావేరి సీడ్లో ఉద్యోగ పనిచేసి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మార్క్ అజయ్ కుటుంబానికి సోమవారం ఆ సంస్థ యజమాని,ఉద్యోగులు కంటే శంకర్,ద్వారా రూ నాలుగు లక్షల చెక్కును అందజేశారు. కేవపట్నం గ్రామానికి చెందిన గంగా కావేరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మక్త బ్రాంచ్ ఉద్యోగి అయిన మార్క అజయ్ ఇటీవల సింగపూర్ ఆలయం ఎదుట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగినది. వీరి కుటుంబానికి గంగా కావేరి సీడ్స్ యజమాన్యం, ఉద్యోగుల తరపున నాలుగు లక్షల రూపాయల చెక్కును అందిస్తున్న గంగా కావేరి సీడ్స్ జనరల్ మేనేజర్ బాల గంగాధర్ రెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బొద్దిరెడ్డి రాజిరెడ్డి,హెచ్ ఆర్ శ్రీనివాస్,ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily