అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): : జ్యోతి నగర్ ఏప్రిల్ 9 పెద్దపల్లి జిల్లా అక్షరం న్యూస్ ఎన్టిపిసి లో గుర్తింపు యూనియన్ ఐ ఎన్ టి యు సి అనుబంధ ఎన్టిపిసి మజ్దూర్ యూనియన్ కు నూతన సారథులను ఎంపిక చేశారు. ఏడాది పాటు ఉండే ఈ కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా వేముల కృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా ఆరెపల్లి రాజేశ్వర్ నియమితులయ్యారు. యూనియన్ సెక్రటరీ జనరల్ ఐఎన్టియుసి జాతీయ నాయకుడు బాబర్ సలీం పాషా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించి యాజమాన్యానికి సమర్పించారు. 112 మంది కార్యవర్గంతో ఏ వేసిన ఈ జంబో కమిటీలో వెల్ఫేర్ సెక్రెటరీగా నేరెళ్ల రమేష్ కోశాధికారిగా శ్రీనివాస్ ఎంపికయ్యారు. యూనియన్ కు నూతన సలహాదారులుగా ఎం కమలాకర్ రావు కాసర్ల వెంకటస్వామి కొలిపాక మల్లయ్య నియమితులయ్యారు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి సంజీవరెడ్డి అనుమతితో ఈ కమిటీ ప్రకటించామని బాబర్ సలీం భాషా తెలిపారు ఉగాది పర్వదినం నుంచే ఈ కమిటీ పని కొనసాగుతుందని ఆయన చెప్పారు.
.
Aksharam Telugu Daily