అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : - పెద్దపల్లి/ కమాన్పూర్/ ఏప్రిల్26/ అక్షరం న్యూస్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు పథకాల ఆశ చూపి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ దేనని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా శుక్రవారం కమాన్ పూర్ మండలం రొంపికుంట, నాగారం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ ప్రదేశాల్లో ఆయన పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్సోళ్లకు పథకాలు గుర్తుకు వస్తాయని, ఎన్నికల తర్వాత పథకాల అమలును వాయిదాలు వేస్తారని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పార్లమెంట్ ఎన్నికల వరకు ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, నాడు పథకాల పేరుతో అగం చేసినోళ్లే మళ్లా ఆగం చేసేందుకు వస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక పథకాలు అమలు చేస్తామని డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని హమీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ రుణమాఫీని పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకుంటూ అగస్టు 15కి వాయిదా వేశాడని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం అందించిన పథకాలనే కొనసాగిస్తున్నారని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసి కొట్లాటలు పెట్టిస్తున్నారని, ఇటీవలి కాలంలో అనేక సంఘటలు ఇందుకు నిదర్శనమన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని కోరుకుందని, ఏనాడు ప్రజలకు పథకాల ఆశ చూపలేదని, ప్రజల అవసరాలను గుర్తించి పథకాలకు రూపకల్పన చేసిన చరిత్ర గత ప్రభుత్వందేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారం ఇచ్చి అరిగోసపడుతున్నామని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే ఆగమైపోతామని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను ఆశీర్వదించాలని, గతంలో మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేశారని, పేద వర్గాలకు అండగా నిలచే నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని ఆయన అన్నారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, మనస్సున్న మారాజు కొప్పుల ఈశ్వర్కు అండగా నిలిచి బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీ. ఆర్. ఎస్ నాయకులు రాచకొండ రవి, ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, మేకల సంపత్ యాదవ్, బాద్రపు మల్లేష్, కొట్టె భూమయ్య, కొయ్యడ రవి, చిందం తిరుపతి, తాటికొండ శంకర్, కొండ వెంకటేష్, ఆకుల గట్టయ్య, నీలం శ్రీనివాస్, ఎద్దు రాజయ్య, నడిగొట్టు సంపత్, పెండ్లి నారాయణ, బొమ్మగాని అనిల్ గౌడ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily