అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 23/అక్షరం న్యూస్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ పార్టీ సత్తా చాటుదామని ... గులాబీ జెండా ఎగిరెద్దామని రామగుండం మాజీ శాసనసభ్యులు బీ.ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. శనివారం గోదావరిఖని పట్టణంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్లో పార్లమెంటు ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త శ్రమిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు తధ్యమని అన్నారు.పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుండి నిలిచిన గడ్డం వంశీకృష్ణ కు ఇంకా ఓనామాలే రావని,బీజేపీ నుండి నిలిచిన అభ్యర్థి ఎన్నికలప్పుడు వచ్చిపోయే వలసవాదని, కొప్పుల ఈశ్వర్ ఒక్కడే ఈ ప్రాంత బిడ్డగా ఈప్రాంత ప్రజల కష్టాలు తెలిసినవాడని,ఎమ్మెల్యేగా,మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని అన్నారు.పెద్దపల్లి ఎంపీ గా కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని ఆయన కోరారు. కార్యకర్తలందరు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కృషి చేయాలన్నారు.
.
Aksharam Telugu Daily