అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్/-ఏప్రిల్-22(ఆక్షరం న్యూస్) ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల వితరణ చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామాల్లో ఎవరైనాసరే పేదింటి ఆడపిల్లలకు వివాహ సమయంలో వారు కొరినచో పుస్తేమెట్టెలు అందజేసి వారికి పెద్దన్నయ్యల అండగా ఉంటున్నారు ఈ క్రమంలో ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో నాగేల్లి చంద్రవ్వ సుధాకర్ దంపతుల కూతురు భవాని వివాహం.అలాగే నామపూర్ గ్రామానికి చెందిన యారపు లక్ష్మీ బుదయ్య దంపతుల ద్వితీయ పుత్రిక స్వాతి వివాహం సోమవారం జరుగుతున్న నేపథ్యంలో వారి వివాహాలకు పుస్తె మట్టెలు ఎంపీపీ జనగామ శరత్ రావు పంపియడంతో,ఈ పుస్తె మట్టెలను వధువు తల్లిదండ్రులకు గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మ దేవి రెడ్డి తడెపు అనిల్, ఉపాధ్యక్షుడు న్యాలం బాలా గౌడ్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి నారాయణ బీ ఆర్ ఎస్వీ ఉపాధ్యక్షులు బండి ఆదర్శ పటేల్ ఉపాధ్యక్షుడు బాల చెంద్రం, మైనార్టీ సెల్ అధ్యక్షులు వాఖీలుద్దీన్. సోహెల్ ,మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగేల్లి దేవయ్య నామపూర్ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి కడమంచి దేవేందర్ , మండల బీ ఆర్ ఎస్వీ ఉపాధ్యక్షులు నాగేల్లి బాబు ,సీనియర్ నాయకులు మంద బాల్ రెడ్డి , ముష్కం దేవ గౌడ్ క్యారం మల్లేష్ , ముష్కమ్ కృష్ణ ,నారోజు చారి, నాగెల్లి సతీష్,మహేష్ కేటీఆర్ సేన,సోషల్ మీడియా నరేంద్ర చారి, సల్కము ఎల్లం,లు అందచేసారు.ఇప్పటివరకు 35 నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల వితరణ చేయడం జరిగిందని వారు తెలిపారు , ఆ భగవంతుని దయతో నిరుపేద యువతుల పెళ్లిలకు పుస్తె మట్టెల పంపిణీ ఇంకా కొనసాగిస్తామని అని వెల్లడించారు ఎంపీపీ జనగామ శరత్ రావు మంచి మనసుకు వధువు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
.
Aksharam Telugu Daily