అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : - సుల్తానాబాద్, (పెద్దపల్లి జిల్లా) ఏప్రిల్ 8, అక్షరం న్యూస్. గత ఎన్నో సంవత్సరాలుగా కరెంట్ మోటార్ల దొంగతనం చేస్తున్న వ్యక్తి ను పొలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సుల్తానాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏ.సి.పి గజ్జి కృష్ణ తెలిపారు.కొత్తపల్లి, మీరం పేట గ్రామ నివాసి గోపు సంపత్,అనే వ్యక్తి సుతారి' పని చేస్తూ జీవనం సాగించే వారు. జల్సాలకు అలవాటు పడి, డబ్బులు సరిపోక పోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డారని, గత ఎన్నో సంవత్సరాలుగా వివిధ రకాల దొంగతనాలకు పాల్పడ్డారనీ,ఈ వ్యక్తి పై ఇంత వరకు16 కేసులు ఉన్నాయని వివరించారు. గత ఆదివారం రోజు మధ్యాహ్నం గుంపుల బ్రిడ్జి సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి పోలీసులను చూసి ద్వి చక్ర వాహనం ఎక్సెల్ పై పారిపోతుంటే అనుమానంగా, పోత్కపల్లి పోలీసులు,వెంబడించి,పట్టుకుని,విచారించగా, దొంగతనం విషయాలు తెలిసాయనీ ,రైతులు మానేరు వాగు ఎస్సారెస్పీ కాలువల మీద బావులకు అమర్చుకున్న కరెంటు మోటార్లను రాత్రి వేళల్లో దొంగిలించి తన ఇంట్లో పెట్టుకునే వాడని, డబ్బులు అవసరం ఉన్నపుడు మోటార్లు, జమ్మికుంట, వరంగల్ పట్టణాల్లో అమ్మేవాడనీ,ఏ సి.పి తెలిపారు. దొంగలించిన 20 కరెంటు మోటార్లు,ఒక టీ.వీ.ఎస్. ఎక్సెల్ ద్విచక్రవాహనాన్ని పొలీసులు స్వాదీనం చేసుకున్నట్లు వివరించారు.నేరస్తులను పట్టుకోనుటలో కృషి చేసిన సి.ఐ.జి.సుబ్బా రెడ్డి, పోత్కపల్లి ఏస్.ఐ.జి. అశోక్,ఏ.ఎస్.ఐ లు తిరుపతి, హెచ్.సి.రత్నాకర్, హెచ్.సి నల్లవెల్లి సుధాకర్, పి.సి.రాజేందర్ ఇతర పోలీస్ సిబ్బందిని,పెద్దపల్లి ఏ.సి.పి,అభినందించారు.
.
Aksharam Telugu Daily