Tuesday, 14 May 2024 10:00:37 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

..... బ్రేకింగ్ న్యూస్....... కరెంటు మోటార్ల దొంగ ను పట్టుకున్న పోలీసులు.

పోలీసులను అభినందించిన ఏ.సి.పి.

Date : 08 April 2024 02:03 PM Views : 462

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : - సుల్తానాబాద్, (పెద్దపల్లి జిల్లా) ఏప్రిల్ 8, అక్షరం న్యూస్. గత ఎన్నో సంవత్సరాలుగా కరెంట్ మోటార్ల దొంగతనం చేస్తున్న వ్యక్తి ను పొలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సుల్తానాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏ.సి.పి గజ్జి కృష్ణ తెలిపారు.కొత్తపల్లి, మీరం పేట గ్రామ నివాసి గోపు సంపత్,అనే వ్యక్తి సుతారి' పని చేస్తూ జీవనం సాగించే వారు. జల్సాలకు అలవాటు పడి, డబ్బులు సరిపోక పోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డారని, గత ఎన్నో సంవత్సరాలుగా వివిధ రకాల దొంగతనాలకు పాల్పడ్డారనీ,ఈ వ్యక్తి పై ఇంత వరకు16 కేసులు ఉన్నాయని వివరించారు. గత ఆదివారం రోజు మధ్యాహ్నం గుంపుల బ్రిడ్జి సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి పోలీసులను చూసి ద్వి చక్ర వాహనం ఎక్సెల్ పై పారిపోతుంటే అనుమానంగా, పోత్కపల్లి పోలీసులు,వెంబడించి,పట్టుకుని,విచారించగా, దొంగతనం విషయాలు తెలిసాయనీ ,రైతులు మానేరు వాగు ఎస్సారెస్పీ కాలువల మీద బావులకు అమర్చుకున్న కరెంటు మోటార్లను రాత్రి వేళల్లో దొంగిలించి తన ఇంట్లో పెట్టుకునే వాడని, డబ్బులు అవసరం ఉన్నపుడు మోటార్లు, జమ్మికుంట, వరంగల్ పట్టణాల్లో అమ్మేవాడనీ,ఏ సి.పి తెలిపారు. దొంగలించిన 20 కరెంటు మోటార్లు,ఒక టీ.వీ.ఎస్. ఎక్సెల్ ద్విచక్రవాహనాన్ని పొలీసులు స్వాదీనం చేసుకున్నట్లు వివరించారు.నేరస్తులను పట్టుకోనుటలో కృషి చేసిన సి.ఐ.జి.సుబ్బా రెడ్డి, పోత్కపల్లి ఏస్.ఐ.జి. అశోక్,ఏ.ఎస్.ఐ లు తిరుపతి, హెచ్.సి.రత్నాకర్, హెచ్.సి నల్లవెల్లి సుధాకర్, పి.సి.రాజేందర్ ఇతర పోలీస్ సిబ్బందిని,పెద్దపల్లి ఏ.సి.పి,అభినందించారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :