అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : . గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/ఏప్రిల్ 2/అక్షరం న్యూస్: జీడికే ఓసీపీ 5 లో 2023- 24 సంవత్సరానికి గాను నిర్దేశించిన ఉత్పత్తిని సాధించినందుకు గాను మంగళవారం రామగుండం ఏరియా1జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఓసిపి 5 అధికారులను సూపర్వైజర్ లను కార్మికులను అభినందించినారు..ముందుగా జీడికే ఓసీపీ 5 అధికారులు కార్మికులు జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ని పూలే బోకే శాలువాతో సన్మానం చేసినారు. జిఎం మాట్లాడుతూ ఓసీపీ 5లో నిర్దేశించిన 30 లక్షల టన్నుల ఉత్పత్తికి గాను 35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందని కార్మికులు అందరూ సహాయ సహకారాలతో సాధించామని అన్నారు. తధనంతరం అధిక ఉత్పత్తి సాధనలో కృషి చేసిన ఆరుగురికి క్యాష్ అవార్డు జనరల్ మేనేజర్ చేతుల మీదుగా అందజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ కే. చంద్రశేఖర్, సీఎం ఓ ఏ ఐ ఎస్ సి సి ఎల్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్,డీజీఎం రామస్వామి, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎన్ వి రావు,కాలిరీ మేనేజర్ అనిల్ గాబలే, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ అరెల్లి పోశం,ఏరియా వైస్ ప్రెసిడెంట్ మదన మహేష్ ,ఓసి 5 పిట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్ పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily