అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,ఏప్రిల్10(అక్షరం న్యూస్): కారు చెట్టును డీకొట్టడంతో ఒకరు మృతి చెంది మరొకరికీ గాయలైన ఘటన మండల పరిధిలోని బేగంపేట గూడెం గ్రామాల సరిహద్దులో మంగళవారం రాత్రి జరిగినది. వివరాలలోకి వెళితే మండలంలోని గూడెం గ్రామానికి చెందిన హనుమాండ్ల సందీప్ రెడ్డి(29), వడ్లుర్ గ్రామానికి చెందిన తన మిత్రుడు రాజుతో కలిసి లక్ష్మీపూర్ గ్రామం నుండి కారు(ఏపీ15బీఈ6767)లో ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి చెట్టు డీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న సందీప్ రెడ్డికి చాతిలో మొహం,ముక్కు పైన తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందడని మృతుడి తండ్రి రామచంద్రరెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, రాజుకు స్వల్ప గాయాలు అవ్వగా అతనిని కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.
.
Aksharam Telugu Daily