అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/వైరా ఏప్రిల్ 16 (అక్షరంన్యూస్) సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు నేరుగా రిజిస్టర్ కార్యాలయం సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఎలాంటి మధ్యలో డాక్యుమెంట్ రైటర్ ను ఆశ్రయించవలసిన అవసరం లేదని వైరా సబ్ రిజిస్టర్ కరుణ తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ కరుణ మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్ అయిన అవి నేరుగా చేసుకునే విధంగా అవకాశం ఉందని దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మధ్యలో ఎవరిని నమ్మి ఎవరు వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి ఏ విధంగా చేయాలి అని రిజిస్టర్ కార్యాలయంలో అడిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. డాక్యుమెంటేషన్ చేయవలసిన అవసరం లేదని ఎలాంటి వ్యక్తులు మీ వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్ సంబంధించి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వారి వివరాలు నేరుగా మాకు ఇవ్వాలని ఆమె తెలిపారు. ప్రజల ముఖ్యంగా గమనించవలసింది సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి మేము అన్ని పనులు చేస్తాము డాక్యుమెంటేషన్ మేమే చేయాలి అని ఎవరైనా చెప్పినా అలాంటి వారి మాటలు అసలు నమ్మొద్దు అని తెలిపారు.
.
Aksharam Telugu Daily