అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : - మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 29(అక్షరం న్యూస్) పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె నర్సరీ వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది కానీ క్షేత్ర స్థాయిలో పల్లె నర్సరీ వనాల పరిస్థితి అధ్వాన్నంగా కనిపిస్తోంది గంగారం మండలం లోని కోమట్లగూడెం గ్రామంలో పల్లె నర్సరీ వనం నీళ్లు లేక మొక్కలు ఎండిపోతున్నాయి రహదారికి సమీపంలో ఉన్న పల్లె నర్సరీ వనాన్ని రహదారి మార్గాన వెళ్తే ఉన్న తాధికారులు పట్టించుకోవడం లేదు గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఉపాధి హామీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అని అధికారుల పై ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రహదారి మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు కూడా అధికారుల పై విమర్శలు గుప్పిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పల్లె నర్సరీ వనం లో చెత్త చెదారాన్ని తొలగించి నీటి సౌకర్యాన్ని కల్పించి పల్లె (పకృతి లో ని మొక్కల్ని కాపాడవలసిందిగా గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
.
Aksharam Telugu Daily