అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ : ● మహబూబాబాద్ జిల్లా/ఏప్రిల్.23/అక్షరం న్యూస్; మహబూబాబాద్ జిల్లా కేంద్రం దంతాపల్లి లో సోమవారం జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ మహిళా శక్తి సమ్మేళనంలో మహబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ బానోతు విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా సీతరాంనాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని.ప్రధాని మోడీ నాయకత్వం లో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలంగాణ లో బిజెపి అత్యధిక ఎంపీ సీట్లు గెలవబోతుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్, ధర్మారావు, శిల్పారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily