అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రంగారెడ్డి/ రాజేంద్రనగర్ : రంగారెడ్డి / రాజేంద్రనగర్ / గండిపేట్ / ఏప్రిల్ 21/ అక్షరం న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఖాయమని ఆ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి మునిసిపాలిటీ పరిధిలోని వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి ప్రాంతాల్లో ఎంపీ రంజిత్ రెడ్డికి మద్దతుగా రవీందర్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రంజిత్ రెడ్డి ఎంపీగా నియోజకవర్గానికి ఎంతగానో మేలు చేశారని వివరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి శ్రమించాలన్నారు. బిజెపి టిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని ప్రజలు విశ్వసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గండిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ యాదవ్, నార్సింగి మున్సిపాలిటీ కార్యదర్శి మైలారం ప్రదీప్ కుమార్, అరుణ్ ముదిరాజ్, స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily