అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : . సుల్తానాబాద్,(పెద్దపల్లి జిల్లా), ఎప్రిల్ 9, అక్షరం న్యూస్. సుల్తానాబాద్ పట్టణం లోని ఆలంగిర్ మస్జిద్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ ఎం.పి.టి.సి. స్టూడెంట్ జే.ఎ.సి జిల్లా కన్వీనర్ సురా శ్యామ్ మంగళ వారం రోజు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ సంధర్బంగా సురా శ్యామ్ మాట్లాడుతు రంజాన్ మాసంలో ఉపవాసాలతో ప్రపంచ మానవాళి ఆయురారోగ్యాలు కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేస్తారని, ఆ అల్లాహ్ ముస్లిం సోదరుల ప్రార్థనలు మన్నించి అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజలందరూ సుఖశాంతులతో జీవనం గడపాలని ముస్లిం సోదరుల తో కలిసి ప్రార్థించారు. అనంతరం మస్జిద్ కమిటి సూరా శ్యామ్ ను శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటి సభ్యులు, ఉపవాస దీక్ష లో ఉన్న ముస్లిం యువకులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily