అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా/మర్పల్లి/ఏప్రిల్ 16/అక్షరం న్యూస్:-మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో నీ ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఆరు గారెంటీలు అందించేందుకు కృషి చేస్తానని మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందే దాకా నిద్రపోను అని పేర్కొన్నారు. అందుబాటులో లేని నేత మాకు పోటీయే కాదు ఎంపీ రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బ్రిటిష్ షో డు ఈ దేశాన్ని మొత్తం ఊడ్చుకుపోయాక పేదోళ్లకు పట్టెడన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబమని కొనియాడారు. సంక్షోభం నుండి సంక్షేమం దేశానికి దశా దిశా కాంగ్రెస్ లోనే దొరికిందన్నారు. తాను ఎంత అదృష్టవంతుడు అయితేనే ఈ వికారాబాద్ నియోజకవర్గానికి ఎంపీ ని అవుతానని గుర్తు చేశారు. ఈ అదృష్టం వికారాబాద్ నియోజకవర్గ మర్పల్లి మండల ప్రజలు ఇచ్చిన అవకాశం అని అదే అదృష్టం అని ప్రతి మర్పల్లి మండల బిడ్డ కండ్లలో చూసేదాక తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రవీందర్,సుభాష్ యాదవ్, కొండల్ రెడ్డి, రామేశ్వర్, రాములు యాదవ్, మాజీ సర్పంచ్ చంద్రన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి, ఎంపీటీసీలు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily