అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి జిల్లా /కొత్తగూడెం/ ఏప్రిల్.09/ అక్షరం న్యూస్ ; ఎండల తీవ్రత దృశ్యా రమజాన్ పండుగ యొక్క ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ను ప్రశాంతత వాతావరణంలో చదివేందుకు కొత్తగూడెం పట్టణ ముస్లిం కమిటీలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. కొత్తగూడెం పట్టణ వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉన్న పాత 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దగల జమియా మస్జీద్ లో ఉదయం 9:30 గంటలకు అలాగే సెంట్రల్ వర్క్ షాప్ వద్ద గల ఈద్గా మైదానంలో ఉదయం 9:00 గంటలకు సమయం నిర్దారించడమైనది. అలాగే కొత్తగూడెం జమియతే అహెల్ హాదిస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ బర్లీఫిట్ ఏరియాలో ప్రగతి మైదానంలో ఎండ తీవ్రత దృశ్యా ఉదయం గం7:15 నిమి నమాజ్ ను చదవడానికి ఏర్పాట్లు చేయడమైనది..రామవరం 14నెం ఏరియా ఈద్గా లో ఉదయం 9:00గం నమాజ్ చదివేందుకు ఏర్పాట్లు చేయడమైనది. కొత్తగూడెం జమియతే అహెల్ హాదిస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ బర్లీఫిట్ ఏరియాలో గల ప్రగతి మైదానంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఈద్-ఉల్ -ఫితర్ నమాజ్ ఆచరించేందుకు ఏర్పాట్లు చేయడమైనది నిర్వాహకులు తెలిపారు. కొత్తగూడెం మరియు రామవరం ఈద్గా లో రంజాన్ నమాజ్ చదివేందుకు ఏర్పాట్లకు గాను కొత్తగూడెం మున్సిపల్ శాఖ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం పట్ల ముస్లిం మత పెద్దలు అధికారులకు ,పాలక వర్గానికి ముఖ్యంగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కి కృతజ్ఞతలు తెలిపారు.
.
Aksharam Telugu Daily