అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/ కరీంనగర్/ ఏప్రిల్ 23( అక్షర న్యూస్) చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్వహణ కమిటి అధ్వర్యంలో లో చేపట్టిన హరినామ సంకీర్తనలు రాష్ట్ర స్థాయి భజన పోటీలలో కేశవపట్నం గ్రామానికి చెందిన శివకేశవ భజన మండలి సభ్యులు పాల్గొని ద్వితియ బహుమతి పొందారు. వివిధ జిల్లాల నుండి ఇరవైకి పైగా భజన బృందాకు పాల్గొన్న ఈ పోటిలలో ఉత్తమ ప్రతిభ కనబరచి ద్వితియ బహుమతి పొందటంతో భజన ప్రియులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొన్న వారిలో నాగభూషణం, ప్రమోద్, బొంగోని శ్రీనివాస్, మొలంగూరి రాజ్ కుమార్, తనుకు శ్రీనివాస్, ఆకుల కుమారస్వామి, దొమ్మటి వెంకటేష్, తనుకు శ్రీనివాస్, బొంగోని కృష్ణ స్వామి, రాసమల్ల శ్రీనివాస్, కళ్ళెపెల్లి క్రాంతి కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు
.
Aksharam Telugu Daily