అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 26/అక్షరం న్యూస్: రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని లైసెన్సు కలిగిన తుపాకులను వెంటనే సరెండర్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్, ఆదేశాలు జారీచేశారు.పార్లమెంట్ ఎన్నికకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో పోలీసుశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది.ఆయుధాల చట్టం1959 సెక్షన్ 21 ప్రకారం.. కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ,లైసెన్సు తుపాకులు కలిగి ఉన్నవారంతా సమీపంలోని పోలీసుస్టేషన్లో డిపాజిట్ చేయాలి.ఎన్నికల నేపథ్యం లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా,ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేయాలి.అలా చేయని వారిపై కేసులు పెట్టేందుకు వెనకాడమని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీపీ తెలిపారు.డిపాజిట్ చేసిన ఆయుధాల ను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి తేదీ: 07-06-2024 రోజున తీసుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో జాతీయ బ్యాంకులు,ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది,గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు.
.
Aksharam Telugu Daily