అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : .... పెద్దపల్లి ప్రజలది మార్చి 22 అక్షరం న్యూస్; పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ఇంటి పన్నుల బకాయి చెల్లింపులపై ప్రభుత్వం కల్పించిన 90 శాతం రాయితీని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కోరారు. మార్చి 31 లోగా పన్ను బకాయలు చెల్లించిన వారికి 90 శాతం సబ్సిడీ వర్తిస్తుందని ఆ తర్వాత చెల్లించేవారికి పన్నులపై వడ్డీ భారం పడుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పునరుద్ఘటించారు. పెద్దపల్లి పట్టణంలోని తన చాంబర్లో శుక్రవారం అక్షరం ప్రతినిధితో మున్సిపల్ కమిషనర్ పన్నుల బకాయి విషయమై మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలో ఇప్పటివరకు 6.52 కోట్ల రూపాయల పన్నుల బకాయిలు ఉండగా ఇప్పటివరకు 3.55 కోట్ల రూపాయలు వసూలు అయినట్టు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 54.51% పన్నులు మాత్రమే వసూలు అయినట్టు ఆయన వివరించారు. ఇంకా 2.96 కోట్ల రూపాయలు పన్నుల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన తెలిపారు. పట్టణ ప్రజలు ప్రభుత్వం కల్పించిన రాయితీ సౌకర్యాన్ని సద్విని చేసుకోవాలని సూచించారు. పట్టణ పరిధిలో పన్నుల బకాయి కారణంగా అభివృద్ధి కుంటుపడిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించిన రాయితీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పట్టణ ప్రజలకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు మున్సిపల్ ఆదాయం పెరుగుతుందని తద్వారా అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. పెద్దపల్లి పట్టణ ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సౌకర్యాన్ని సద్విని తీసుకొని పట్టణ ప్రగతి కోసం పాటుపడాలని ఆయన కోరారు.
.
Aksharam Telugu Daily