Tuesday, 14 May 2024 04:42:52 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

పన్ను చెల్లింపు పై రాయితిని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ... ఈనెల 31 వరకే అవకాశం

ఆ తర్వాత వడ్డీకి మళ్ళీ వడ్డీ చెల్లించాల్సి వస్తోంది ... మున్సిపల్ పరిధిలో 6.52 కోట్లు పన్నుల బకాయిలు .... ఇప్పటివరకు 3.55 కోట్లు వసూలు ....2.96 కోట్లు పన్నుల బకాయి పెండింగ్ .... పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్

Date : 22 March 2024 07:52 PM Views : 293

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : .... పెద్దపల్లి ప్రజలది మార్చి 22 అక్షరం న్యూస్; పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ఇంటి పన్నుల బకాయి చెల్లింపులపై ప్రభుత్వం కల్పించిన 90 శాతం రాయితీని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కోరారు. మార్చి 31 లోగా పన్ను బకాయలు చెల్లించిన వారికి 90 శాతం సబ్సిడీ వర్తిస్తుందని ఆ తర్వాత చెల్లించేవారికి పన్నులపై వడ్డీ భారం పడుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పునరుద్ఘటించారు. పెద్దపల్లి పట్టణంలోని తన చాంబర్లో శుక్రవారం అక్షరం ప్రతినిధితో మున్సిపల్ కమిషనర్ పన్నుల బకాయి విషయమై మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలో ఇప్పటివరకు 6.52 కోట్ల రూపాయల పన్నుల బకాయిలు ఉండగా ఇప్పటివరకు 3.55 కోట్ల రూపాయలు వసూలు అయినట్టు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 54.51% పన్నులు మాత్రమే వసూలు అయినట్టు ఆయన వివరించారు. ఇంకా 2.96 కోట్ల రూపాయలు పన్నుల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన తెలిపారు. పట్టణ ప్రజలు ప్రభుత్వం కల్పించిన రాయితీ సౌకర్యాన్ని సద్విని చేసుకోవాలని సూచించారు. పట్టణ పరిధిలో పన్నుల బకాయి కారణంగా అభివృద్ధి కుంటుపడిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించిన రాయితీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పట్టణ ప్రజలకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు మున్సిపల్ ఆదాయం పెరుగుతుందని తద్వారా అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. పెద్దపల్లి పట్టణ ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సౌకర్యాన్ని సద్విని తీసుకొని పట్టణ ప్రగతి కోసం పాటుపడాలని ఆయన కోరారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :