అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ... ఖమ్మం/ వైరా ఏప్రిల్ 14 (అక్షరంన్యూస్) ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డికి టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పరికపల్లి శ్రీను డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ కి కీలకంగా వ్యవహరించి తమదైన ముద్ర తో ఖమ్మం జిల్లా లో పది కి తొమ్మిది సీట్లు గెలిపించడం లో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీ కి జోష్ తీసుకు వచ్చిన డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ రెవిన్యూ శాఖపొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి సోదరుడికి ఖమ్మం పార్లమెంట్ సీటు కేటాయిస్తే బారి మెజారిటీతో గెలిచి రాష్ట్రం లో వున్న అన్ని ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం అవుతుందని అశభావం వ్యక్తం చేశారు. జిల్లాలో రాష్ట్రం లో పొంగులేటి తిరుగేని అభిమానాన్ని సంపాదించుకున్నారనీ తెలిపారు. ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రసాద రెడ్డి పేరు ఖరారు చేయాలని అధిష్ఠానం ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily