Tuesday, 14 May 2024 07:46:52 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

వలసవాదులతో అభివృద్ధికి ఆటంకం... ...అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం...

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచింది.. ...తెలంగాణను సాధించుకొని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ..మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

Date : 22 April 2024 06:01 PM Views : 248

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 22 అక్షరం న్యూస్; వలసవాదులతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, అలాంటి వారికి ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి ఆయాన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి యొక్క అభివృద్ధికి కృషి చేసిందన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచిందని విమర్శించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త మండలాలు, నియోజకవర్గాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రజలను ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఇది ఇలా ఉంటే నష్టపోయిన రైతులను పెద్దపల్లి ఎమ్మెల్యే ఒక్కసారి అయిన కలసి వారికీ మద్దతు తెలిపారా.. ఎండిపోయిన పంటలను పరిశీలించారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసారని అన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని ప్రజలకు కొప్పుల ఈశ్వర్ గారు పిలుపునిచ్చారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దాసరి ఉష, తో పాటు. తదితరులు పాల్గొన్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :