అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రికొత్తగూడెంజిల్లా/చుంచుపల్లి మనందరి సృష్టి కర్త అయిన దేవుడు ఒక్కడే. మనమంతా ఒక్కటేనని, కులమతాలకు అతీతంగా ఒకరి సుఖదుఃఖాలను మరోకరు పంచుకుంటూ కలిసి మెలిసి జీవించినప్పుడే సమాజం లో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయని జమాతే ఇస్లామి హింద్ రుద్రంపూర్, రామవరం శాఖా అధ్యక్షులు షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా శనివారం ఉదయం రాంపూర్ గ్రామం లో, పనికి ఆహారం పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన "ఈద్ మిలాఫ్ " కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ, మనుషులంతా ఒక్కటేనని, కులమతాల హెచ్చుతగ్గులు లేవని, ఉన్నదాంతో తృప్తి పడుతూ, మంచివారిగా జీవించాలి రంజాన్ ఉపవాసాలు శిక్షణ ఇస్తాయని, ఒకరి పండుగలు పర్వదినాలు మరోకరు పంచుకుంటే ప్రేమానురాగాలు ఆప్యాయత అనుబంధాలు పెరుగుతాయని అన్నారు. కష్టపడి జీవించడం లోనే ఆనందం ఉంది అని, ఉన్న దాంట్లో కుటుంబ సభ్యులు అందరూ సర్దుకుని జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు ఫాతిమా, పర్వీన్, షేహ్నజ్, పర్వీన్ సుల్తానా, అనీష్, రజీయా, యాకుబ్ బీ, లలీత, లక్ష్మీ, నిర్మలమ్మ, పార్వతీ, జమాత్ సభ్యులు షమీం, అజ్మత్, రబ్బానీ, తదితరులు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily