అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రంగారెడ్డి/ రాజేంద్రనగర్ : : రంగారెడ్డి / రాజేంద్రనగర్ / గండిపేట్ / ఏప్రిల్ 23/ అక్షరం న్యూస్ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులను ఆయన సాధరంగా ఆహ్వానించారు. ఇప్పటికే కార్పొరేషన్ మేయర్ గా పనిచేసిన బుర్ర మహేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం టిఆర్ఎస్ కార్పొరేటర్లు 11 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కార్పొరేషన్ లో టీఆర్ఎస్ ప్రాతినిధ్యం కోల్పోయిన కోల్పోయింది. డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సమక్షంలో పదిమంది కార్పొరేటర్లతో కలిసి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో డిప్యూటీ మేయర్ పులపల్లి రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్లు మద్దెల లత ప్రేమ్ గౌడ్, తలారి చంద్రశేఖర్, నిఖిల సంగారెడ్డి, షాపురం పుష్పలత శ్రీనివాస్ రెడ్డి, అస్లం బేగ్, అనిత వెంకటేష్, శ్రీనాథ్ రెడ్డి, సంతోష్ రాజిరెడ్డి, ఆసియా ఖాజా, రవీందర్ రెడ్డిలు ఉన్నారు.
.
Aksharam Telugu Daily