అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఏప్రిల్ 19 ---- దేవ భక్తుని సాంబశివరావు రెండవ వర్ధంతి సందర్భంగా జవ్వాది మురళీకృష్ణ ఆధ్వర్యంలో వారి కుమారుడు ఆర్ కె సిడ్స్ యజమాని రామకృష్ణ కుమార్తె రాధిక వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యాలయం విద్యార్థులకు తండ్రి సాంబశివరావు జ్ఞాపకార్థం రెండు కూలర్లు లను మరియు విద్యార్థులకు అరటి పండ్లు స్వీట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి నాన్నగారి జ్ఞాపకార్థం కూలర్లు ను అందజేయడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాలలోని ఆదివాసి విద్యార్థులను తీసుకొచ్చి వారికి చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు వంటి వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యాలయం సేవలు అభినందనీయం అని ఆమె అన్నారు. దాతలకు నిలయ కమిటీ సభ్యులు హృదయ పూర్వకమైన కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనవాసి ప్రాంతీయ సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ సహా కార్యదర్శి గోగికార్ రామ లక్ష్మణ్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న వనవాసి సభ్యులు(హెచ్ ఎం టీవీ సీనియర్ రిపోర్టర్) జవ్వాది మొరళికృష్ణ సుతార్ ఝషి కుమార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily