అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : .. రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట/ఏప్రిల్ 7 (అక్షరం న్యూస్) గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కళాశాల ప్రిన్సిపల్ నిర్మల ఐదవ తరగతి చదువుతున్న ఎడ్ల యశస్విని అనే విద్యార్థిని తల్లిదండ్రుల ముందే చితకబాదిన సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామానికి చెందిన ఎడ్ల ఎల్లం కూతురు ఎడ్ల యశస్విని గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది.పాఠశాలలో భోజనం సరిగా ఉండకపోవడంతో చర్మంపై దద్దుర్లు రావడంతో 15 రోజుల క్రితం చర్మ దవాఖానాలో చూపించి మళ్లీ తిరిగి వారం రోజుల క్రితం పాఠశాలలో చేర్పించారు. కూతురు యశస్విని చూద్దామని పాఠశాలలోకి వెళ్లి ఎలా ఉన్నావ్ అమ్మా అని అడగడంతో, ఆహారం సరిగా ఉండటం లేదు అన్నంలో పురుగులు కూడా వస్తున్నాయని చెప్పడంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ నిర్మల తల్లిదండ్రుల ముందే చితక బాధిందని తల్లిదండ్రులు ఆరోపించారు.మా కండ్ల ముందే మా పిల్లలను ఇలా చితకబాదుతుంటే మేము లేనప్పుడు మ పిల్లలపై ఆమె ప్రవర్తన ఎలా ఉందోనని పిల్లల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు.ఇది ఒక ఉదాహరణ మాత్రమే. గురుకుల పాఠశాలలో 600 పైచిలుకు విద్యార్థులు విద్యను దూరప్రాంతాల నుండి వచ్చి అభ్యసిస్తున్నారు.దాదాపు అందరి పిల్లలపై ఈమె ఈ విధంగా ప్రవర్తిస్తుందని పిల్లలు చెప్పలేకపోతున్నారు తల్లిదండ్రులు లోలోపల కుమిలిపోతున్నారు.ఎవరైనా విద్యార్థులు లోపల జరిగే విషయాలు బయటకి తల్లిదండ్రులకు చెబితే వారిని టార్గెట్ చేసి వారిపై తీవ్రస్థాయిలో ప్రతాపం చూపిస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.కళాశాల తామే సొంతంగా కళాశాల నిర్మించుకున్నట్టు పై అధికారుల మన్నలు పట్టనట్టు వ్యవహరిస్తుందని ఆరోపణలు కూడా ఉన్నాయి.గతంలో కూడా ప్రిన్సిపాల్ నిర్మలపై విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఆరోపణలు చేయడంతో విలేకరులు కళాశాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణలపై ప్రిన్సిపాల్ వద్ద వివరణ కోరుదామని వెళ్ళగా విలేకరులపై ప్రిన్సిపాల్ అసభ్య పదజాలంతో దూషించారనీ.వారి తీరుపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి.అయినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily