Tuesday, 14 May 2024 10:13:27 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణం

ఆహారం సరిగా లేదనీ విద్యార్థిని చెప్పడంతో తల్లిదండ్రుల ముందే చితకబాదిన ప్రిన్సిపల్ నిర్మల.! భయాందోళనలో తల్లిదండ్రులు.! ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు. వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకోవాలి

Date : 07 April 2024 09:37 PM Views : 757

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : .. రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట/ఏప్రిల్ 7 (అక్షరం న్యూస్) గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కళాశాల ప్రిన్సిపల్ నిర్మల ఐదవ తరగతి చదువుతున్న ఎడ్ల యశస్విని అనే విద్యార్థిని తల్లిదండ్రుల ముందే చితకబాదిన సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామానికి చెందిన ఎడ్ల ఎల్లం కూతురు ఎడ్ల యశస్విని గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది.పాఠశాలలో భోజనం సరిగా ఉండకపోవడంతో చర్మంపై దద్దుర్లు రావడంతో 15 రోజుల క్రితం చర్మ దవాఖానాలో చూపించి మళ్లీ తిరిగి వారం రోజుల క్రితం పాఠశాలలో చేర్పించారు. కూతురు యశస్విని చూద్దామని పాఠశాలలోకి వెళ్లి ఎలా ఉన్నావ్ అమ్మా అని అడగడంతో, ఆహారం సరిగా ఉండటం లేదు అన్నంలో పురుగులు కూడా వస్తున్నాయని చెప్పడంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ నిర్మల తల్లిదండ్రుల ముందే చితక బాధిందని తల్లిదండ్రులు ఆరోపించారు.మా కండ్ల ముందే మా పిల్లలను ఇలా చితకబాదుతుంటే మేము లేనప్పుడు మ పిల్లలపై ఆమె ప్రవర్తన ఎలా ఉందోనని పిల్లల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు.ఇది ఒక ఉదాహరణ మాత్రమే. గురుకుల పాఠశాలలో 600 పైచిలుకు విద్యార్థులు విద్యను దూరప్రాంతాల నుండి వచ్చి అభ్యసిస్తున్నారు.దాదాపు అందరి పిల్లలపై ఈమె ఈ విధంగా ప్రవర్తిస్తుందని పిల్లలు చెప్పలేకపోతున్నారు తల్లిదండ్రులు లోలోపల కుమిలిపోతున్నారు.ఎవరైనా విద్యార్థులు లోపల జరిగే విషయాలు బయటకి తల్లిదండ్రులకు చెబితే వారిని టార్గెట్ చేసి వారిపై తీవ్రస్థాయిలో ప్రతాపం చూపిస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.కళాశాల తామే సొంతంగా కళాశాల నిర్మించుకున్నట్టు పై అధికారుల మన్నలు పట్టనట్టు వ్యవహరిస్తుందని ఆరోపణలు కూడా ఉన్నాయి.గతంలో కూడా ప్రిన్సిపాల్ నిర్మలపై విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఆరోపణలు చేయడంతో విలేకరులు కళాశాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణలపై ప్రిన్సిపాల్ వద్ద వివరణ కోరుదామని వెళ్ళగా విలేకరులపై ప్రిన్సిపాల్ అసభ్య పదజాలంతో దూషించారనీ.వారి తీరుపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి.అయినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :