అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి/ సెంటినరీ కాలనీ/ ఏప్రిల్ 22/ అక్షరం న్యూస్: రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఖాయమని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీను బాబు అన్నారు. మంథని అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని కలవచర్ల గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ తో కలిసి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వంశీ కృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శీను బాబు మాట్లాడుతూ వంశీ కృష్ణ ఎంపీగా విజయం సాధిస్తే నియోజకవర్గానికి ఎంతగానో మేలు చేస్తారని యువతకు ఉపాధి కల్పనే ద్యేయంగా పనిచేస్తారని అందుకే వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రాబోయే పార్లమెంటు ఎన్నికలలో వంశీ కృషకు మద్దతుగా నిలిచి చేతి గుర్తుకు వోటు వేసి గెలిపించాలను కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, ఏం పి పి ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, మండల పార్టీ అద్యక్షుడు రోడ్డ బాపన్న, జిల్లా ఉపాధ్యక్షుడు తోట చంద్రయ్య, మాజీ జెడ్ పి టి సి గంట వెంకట రమణ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనం రామచందర్ రావు, ఎల్లే రామ్మూర్తి, బి వి స్వామి గౌడ్, దేవ రామస్వామి, ఎండి మంజూర్, కొట్టే సందీప్, కొలిపాక సారయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily