అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,ఏప్రిల్04(అక్షరం న్యూస్): మండల పరిదిలోని గుగ్గిళ్ళ, బెజంకి క్రాసింగ్, దాచారం,లక్ష్మిపూర్, చిలాపూర్ గ్రామాలలో మండల పరిషత్ అభివృద్ది అధికారి లక్ష్మప్ప వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యంను విక్రయించి మద్దతు ధరను పొందవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిఎమ్ నరసయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయి శంకర్, రేణుక, శ్వేత, సీసీలు సారయ్య, తిరుపతి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily