అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ ఏప్రిల్ 26 (అక్షరంన్యూస్) కూసుమంచి: మల్లేపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన శ్రీ సీతారామ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల వేదాశీర్వచనం పొందారు. అనంతరం ఇదే గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ వేడుక కు హాజరై.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి..మొక్కుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎంపీపీ జూకూరీ గోపాలరావు, నాయకులు నెల్లూరి భద్రయ్య, బజ్జూరి వెంకటరెడ్డి, జొన్నలగడ్డ రవి, , రామ్మూర్తి నాయక్, హఫీజ్ ఉద్దీన్, కొప్పుల చంద్రశేఖర రావు, శ్రీనివాసరెడ్డి, తమ్మినేని నవీన్, సూర్య నారాయణ రెడ్డి, పెండ్ర అంజయ్య, సెట్ రామ్ నాయక్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily