అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : .. పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 26 అక్షరం న్యూస్; ప్రజల తరుపున ప్రశ్నించే గొంతుకగా పోరాటాలు నిర్వహిస్తామని,ప్రతి ఒక్కరు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41, 42వ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసారని విమర్శించారు. దేవుళ్ల మీద ఓట్లు వేసి మాయమాటలు చెప్పుతూ అబద్దాపు ప్రచారాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలను ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోతే ప్రజల తరపున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే రైతు బంధు... రైతు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతులకు సాగునీరు అందక పోవడంతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. మరో సారి బీఆర్ఎస్ పార్టీ కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తోందని అన్నారు. మళ్ళీ కేసీఆర్ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కనీస అవగాహన లేని అభ్యర్థుల వల్ల పెద్దపల్లి అభివృద్ధి కుంటు పడిపోతుందని తెలిపారు. స్థానిక నాయకుడు, సింగరేణి కార్మికుడిగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ గారికి ఒక్క అవకాశం కల్పించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily