అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 24 అక్షరం న్యూస్; చిరు వ్యాపారులకు నష్టం జరుగుతే ఊరుకునేది లేదని వారికి భారత రాష్ట్ర సమితి అండగా నిలుస్తుందని పెద్దపల్లి పార్లమెంటు బి ఆర్ ఎస్అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రోడ్డు వెడల్పు పేరుతో భూ కబ్జాలకు పాల్పడడానికి ఇక్కడ కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా చిరు వ్యాపారులకు నష్టం జరిగితే సహించేది లేదని అవసరమైతే న్యాయ పరంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. గోదావరిఖని లో లక్ష్మీ నగర్, శివాజీ నగర్, హనుమాన్ నగర్ రోడ్డు వెడల్పు బాధితులను కలిసి సమస్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అడిగి తెలుసుకున్నారు. చిరు వ్యాపారులకు వ్రాత పూర్వకంగా భరోసా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం చట్ట విరుద్ధం రోడ్డు వెడల్పు పేరుతో భూ కబ్జాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తే ఊరుకునేది లేదు. నోటీసులు కలెక్టర్, మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వాలి.. కాని ప్రైవేటు వ్యక్తులు ఇండ్లను ఎలా ధ్వంసం చేస్తారు... ఇలా అభివృద్ధి పేరుతో దౌర్జన్యాలు చేసి కూల్చివేస్తే ప్రజా వ్యతిరేకత తప్పదు చిరు వ్యాపారులకు, రోడ్డు వెడల్పు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..
.
Aksharam Telugu Daily