అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.29/ అక్షరం న్యూస్: మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ మరోసారి గద్దెనెక్కేందుకు కుంట్ర చేస్తున్న బిజెపికి తెలంగాణలోనూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ స్థానంలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయం, శేషగిరిభవన్ మీటింగ్ హాల్లో సోమవారం జరిగిన కొత్తగూడెం పట్టణ బూత్ కమిటీ సభ్యులు, భాద్యుల సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల పొత్తును జనం ఆదరిస్తున్నారని, కాంగ్రెస్, కమ్యూనిస్టులవైపే జిల్లా ప్రజానీకం ఉన్నారని ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని, అవే ఫలితాలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీది ఈడీ, ఐటి, కార్పొరేట్ శక్తుల బలమని ఇండియా కూటమిది ప్రజా బలమన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, వేర్వేరుగా పోటీ చేస్తున్నప్పటికీ వారి మధ్య అంతర్గ ఒప్పందం కుదిరిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో గద్దెనెక్కితేనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి గెలుపుకోసం సిపిఐ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, బిజెపి, బిఆర్ఎస్ ఫైఫల్యాలని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యుల కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, గెడ్డాడు నగేష్, భూక్యా శ్రీనివాస్, రత్నకుమారి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయకుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Aksharam Telugu Daily