Thursday, 16 May 2024 03:09:52 PM
 Breaking
     -> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ..      -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..

బిజెపికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానం లేదు

కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి గెలుపు ఖాయం, కాంగ్రెస్ గెలుపుకోసం కార్యకర్తలు శ్రమించాలి ● బూత్ కమిటీ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి :ఎస్.కె.సాబీర్ పాషా

Date : 29 April 2024 08:46 PM Views : 144

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.29/ అక్షరం న్యూస్: మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ మరోసారి గద్దెనెక్కేందుకు కుంట్ర చేస్తున్న బిజెపికి తెలంగాణలోనూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ స్థానంలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయం, శేషగిరిభవన్ మీటింగ్ హాల్లో సోమవారం జరిగిన కొత్తగూడెం పట్టణ బూత్ కమిటీ సభ్యులు, భాద్యుల సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల పొత్తును జనం ఆదరిస్తున్నారని, కాంగ్రెస్, కమ్యూనిస్టులవైపే జిల్లా ప్రజానీకం ఉన్నారని ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని, అవే ఫలితాలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీది ఈడీ, ఐటి, కార్పొరేట్ శక్తుల బలమని ఇండియా కూటమిది ప్రజా బలమన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, వేర్వేరుగా పోటీ చేస్తున్నప్పటికీ వారి మధ్య అంతర్గ ఒప్పందం కుదిరిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో గద్దెనెక్కితేనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి గెలుపుకోసం సిపిఐ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, బిజెపి, బిఆర్ఎస్ ఫైఫల్యాలని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యుల కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, గెడ్డాడు నగేష్, భూక్యా శ్రీనివాస్, రత్నకుమారి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయకుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :