అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / సైదాపూర్ : కరీంనగర్/సైదాపూర్,ఎప్రిల్02(అక్షరం న్యూస్):మండలంలోని సర్వాయిపేట పరిసర ప్రాంతంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గుట్ట ను పర్యాటక కేంద్రం కోసం సీఎం దృష్టి కి తీసుకెళ్ళి అభివృద్ధి కోసం కృషి చేస్తానని బిసి,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా సర్వాయిపేట మహ్మదాపూర్ గ్రామల నడుమ ఉన్న సర్వాయి పాపన్న గుట్ట మీద ఉన్న పాపన్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నియంతృత్వపోకడలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడని ఆయన స్ఫూర్తి తో సమాజంలో మార్పు కోసం మన భాధ్యత నెరవేర్చాలని,నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజలు మార్పు చేశారని,గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సర్వాయి పేట పాపన్న గుట్టను సందర్శించారని,మంత్రిగా మండల ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సిన అవసరాలు,అభివృద్ధి కోసం కృషి చేస్తామని,ఇక్కడి గుట్టలను,గతంలో మీరు కాపడుకున్నట్లుగనే ఇప్పుడు కాపాడం జరుగుతుందని,గుట్టల మీద ఎలాంటి కమర్షియల్ ఆలోచనలు లేవని అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న పాపన్న స్ఫూర్తి తో పాపన్న వారసుడిగా సామాజిక న్యాయం కోసం,భవిష్యత్ తరాలకు పాపన్న ఆనవాల్లు తెలిసెట్లుగా చేయాల్సి ఉందని అన్నారు.అనంతరం గొడిశాల గ్రామ వాసి ఇటీవల మృతి చెందిన వీర జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక్కడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంత సుధాకర్,ఎంపిటిసిలు చాంద్ పాషా,అరుణ మల్లయ్య,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పిటీసి గుండారపు శ్రీనివాస్, ఊసకోయిల రాఘవులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపెల్లి కిష్టయ్య,రాజిరెడ్డి,రమేశ్,రవీందర్,మల్లేష్,రాజు,శ్రీనివాస్,యాదగిరి,రఘు,రవి,వెంకటేశం,రాకేష్,సందీప్,గౌడ సంఘాల ప్రతినిధులు కలర్ సత్తన్న గౌడ్,మహేందర్ గౌడ,అనిల్ గౌడ్,రవీందర్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు,గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily