Tuesday, 14 May 2024 08:42:08 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గుట్ట ను పర్యాటక కేంద్రం కోసం

సీఎం దృష్టి కి తీసుకెళ్ళి అభివృద్ధి కోసం కృషి చేస్తా. మంత్రి పొన్నం ప్రభాకర్.

Date : 02 April 2024 06:01 PM Views : 113

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / సైదాపూర్ : కరీంనగర్/సైదాపూర్,ఎప్రిల్02(అక్షరం న్యూస్):మండలంలోని సర్వాయిపేట పరిసర ప్రాంతంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గుట్ట ను పర్యాటక కేంద్రం కోసం సీఎం దృష్టి కి తీసుకెళ్ళి అభివృద్ధి కోసం కృషి చేస్తానని బిసి,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా సర్వాయిపేట మహ్మదాపూర్ గ్రామల నడుమ ఉన్న సర్వాయి పాపన్న గుట్ట మీద ఉన్న పాపన్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నియంతృత్వపోకడలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడని ఆయన స్ఫూర్తి తో సమాజంలో మార్పు కోసం మన భాధ్యత నెరవేర్చాలని,నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజలు మార్పు చేశారని,గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సర్వాయి పేట పాపన్న గుట్టను సందర్శించారని,మంత్రిగా మండల ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సిన అవసరాలు,అభివృద్ధి కోసం కృషి చేస్తామని,ఇక్కడి గుట్టలను,గతంలో మీరు కాపడుకున్నట్లుగనే ఇప్పుడు కాపాడం జరుగుతుందని,గుట్టల మీద ఎలాంటి కమర్షియల్ ఆలోచనలు లేవని అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న పాపన్న స్ఫూర్తి తో పాపన్న వారసుడిగా సామాజిక న్యాయం కోసం,భవిష్యత్ తరాలకు పాపన్న ఆనవాల్లు తెలిసెట్లుగా చేయాల్సి ఉందని అన్నారు.అనంతరం గొడిశాల గ్రామ వాసి ఇటీవల మృతి చెందిన వీర జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక్కడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంత సుధాకర్,ఎంపిటిసిలు చాంద్ పాషా,అరుణ మల్లయ్య,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పిటీసి గుండారపు శ్రీనివాస్, ఊసకోయిల రాఘవులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపెల్లి కిష్టయ్య,రాజిరెడ్డి,రమేశ్,రవీందర్,మల్లేష్,రాజు,శ్రీనివాస్,యాదగిరి,రఘు,రవి,వెంకటేశం,రాకేష్,సందీప్,గౌడ సంఘాల ప్రతినిధులు కలర్ సత్తన్న గౌడ్,మహేందర్ గౌడ,అనిల్ గౌడ్,రవీందర్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు,గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :